ఒత్తిళ్లకు లొంగి ఆపరేషన్ సిందూర్ ఆపలేదన్న రాజ్ నాథ్.. ! తీవ్రవాదుల్ని ఎందుకు పట్టుకోలేదన్న కాంగ్రెస్..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ లోక్ సభలో చర్చ మొదలైంది. ముందుగా ఆపరేషన్ సింధూర్ చేయడానికి గల కారణం, అందులో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల్ని ఆర్మీ మట్టుబెట్టిన తీరు, ఆ తర్వాత సీజ్ ఫైర్ కు దారి తీసిన పరిస్ధితుల్ని వివరించారు. ఆపరేషన్ సిందూర్ ను ఏ ఒత్తిడికి లొంగీ ఆపలేదన్నారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఆ ఉగ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
గతంలో యూరీ, పుల్వామా దాడుల తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద మౌలిక సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ స్పందిస్తూ.. మరి పహల్గాంలో తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే పాకిస్తాన్ పై యుద్దం చేయాలని తాము అనుకోవడం లేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పగా..ఎందుకు అనుకోవడం లేదో చెప్పాలని మళ్లీ గగోయ్ సూటిగా ప్రశ్నించారు.

हमारी सेनाओं द्वारा की गई सुनियोजित कार्रवाई में 9 आतंकी ठिकानों को बेहद सटीकता से निशाना बनाया गया।
— SansadTV (@sansad_tv) July 28, 2025
अनुमान के अनुसार इस सैन्य अभियान में 100+ आतंकवादी, उनके ट्रेनर, शिष्य और हैंडलर — जो बड़े आतंकी संगठनों से जुड़े थे — ढेर किए गए। - @rajnathsingh on #OperationSindoor pic.twitter.com/nNbLKXcb8M
గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఘుస్ కే మారేంగే (పాకిస్తాన్ లోకి చొరబడి కొడతాం) అంటూ ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత కూడా అదే చెప్తున్నారని గౌరవ్ గగోయ్ ఎద్దేవా చేశారు. ఇవాళ్టికీ రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ కు బ్రేక్ ఇచ్చామని, ఆగలేదని చెబుతున్నారని ఆయన గుర్తుచేసారు. పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తే, తాము స్పందిస్తామని అంటున్నారని, ఓవైపు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చేశామని చెప్పుకుంటున్నారని, మరోవైపు ఉగ్రవాద దాడి మళ్ళీ జరగవచ్చని చెప్తున్నారని గగోయ్ ఆక్షేపించారు.

#WATCH | Speaking in debate on Operation Sindoor, Congress MP Gaurav Gogoi says, "In the end, who takes the responsibility of the Pahalgam attack? The LG of Jammu and Kashmir. If someone needs to take the responsibility, it is the Union Home Minister. Union HM and the Central… pic.twitter.com/Wk9f3h4y0Y
— ANI (@ANI) July 28, 2025
రాజ్ నాథ్ సింగ్ తన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారని, కానీ తీవ్రవాదులు పహల్గాంలోకి ఎలా చొరబడ్డారో, 26 మంది ప్రాణాలు ఎలా తీశారో చెప్పడం లేదని గగోయ్ ఆరోపించారు. పహల్గాం దాడి జరిగి 100 రోజులు దాటి పోయిందని, కానీ ఇప్పటికీ ఆ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల్ని పట్టుకోలేదన్నారు. మనకు డ్రోన్స్, పెగాసస్, శాటిలైట్లు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఉన్నాయని, రక్షణ మంత్రి తాజాగా పహల్గాంలో పర్యటించారని, అయినా ఉగ్రవాదుల్ని పట్టుకోలేదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications