పాకిస్తాన్ పై భారత్ అనూహ్య చర్య
ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సంభవించిన ఈ దారుణ ఉదంతంలో 26 మందిని పొట్టనబెట్టుకున్నారు పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు. ఈ ఘాతుకంపై అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

అప్పట్లోనే భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల రాకను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్ విమానాలకు బ్రేకులు వేసింది. భారత గగనతలంలోకి పాక్ విమానాలేవీ ప్రవేశించకుండా అడ్డుకుంది. ఫలితంగా- చుట్టూ తిరిగి వెళ్తోన్నాయి పాక్ పౌర విమానాలన్నీ.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని పొడిగించింది. భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
నోటీసు టు ఎయిర్మెన్ (NOTAM)ను అధికారికంగా 2025 ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అప్పట్లోనే పాక్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. భద్రతపరమైన కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించింది. దీని కారణంగా పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత్ మీదుగా రాకపోకలు సాగించట్లేదు. ఫలితంగా వాటి ప్రయాణ సమయం దాదాపు 10-15 శాతం వరకు పెరుగుతోంది. 2019లో గగనతలం మూసివేసినప్పుడు కూడా ఇలాంటి ప్రభావమే కనిపించిందని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
ఈ నిర్ణయం 1947 నాటి అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా ఉంది. భౌగోళిక రాజకీయపరమైన సంఘర్షణలు తలెత్తినప్పుడు గగనతలాన్ని నియంత్రించడానికి ఇలాంటి నోటీసులు జారీ చేయడం సాధారణమే. దీనివల్ల ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు రెండు దేశాలు కూడా తమ గగనతలాన్ని మూసివేస్తూ వస్తోన్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications