సాధించలేనిదంటూ ఏమీలేదు ? అమేథీలో గెలుపు సందర్భంగా స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : అమేథీలో విజయంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. మనం అనుకోవాలే కానీ ఏదీ అసాధ్యం కాదని చెప్పారు. 2014లో లక్ష ఓట్ల తేడాతో రాహుల్ గాంధీపై ఓడిపోయిన స్మృతి ఇరానీ .. ఈసారి విజయం సాధించారు. దాదాపు 38 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
స్మృతి కవిత ..
తన విజయం సందర్భంగా ఫేమస్ ఘజల్ దుశ్యాంత్ కుమార్ రాసిన పదాలను ప్రస్తావించారు. 'నాథింగ్ ఈజ్ ఇంపాజిబుల్' 'మీకు ఎవరు చెప్పారు ఆకాశానికి పంక్చర్ అయి రంద్రం పడుతుంది' అని తనదైనశైలిలో కామెంట్లు చేశారు. అమేథీలో స్మృతి ఇరానీ విజయం కంటే ముందు .. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్మృతి ఇరానీని అభినందించారు.

మోదీకి అభినందనలు
కేంద్రంలో మెజార్టీ సీట్లు సాధించిన ప్రధాని మోదీని కూడా రాహుల్ గాంధీ అభినందించారు. కానీ బీజేపీ విధానాలతో తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తన అధ్యక్ష పదవీ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ నిర్ణయిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో నైతిన బాధ్యత వహిస్తూ తాను అధ్యక్ష పదవీ నుంచి తప్పుకుంటాననే సంకేతాలను ఇచ్చారు రాహుల్ గాంధీ.












Click it and Unblock the Notifications