ఏటీఎం వద్దు: పెట్రోల్ బంకుల్లో రూ. 2 వేలు తీసుకోండి
న్యూఢిల్లీ: నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇన్ని రోజులు క్యూలో నిలబడి సమస్యలు ఎదుర్కొన్న ప్రజలకు ఇక ముందు పెట్రోల్ బంకుల్లో నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
దేశంలోని వివిధ చోట్ల ఉన్న 2,500 పెట్రోల్ బంకుల్లో నగదు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చెయ్యడం ద్వారా రోజుకు రెండు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Govt: Cash to be dispensed at 2500 petrol pumps; Cash to be given by swiping of debit/credit card via POS machine pic.twitter.com/Rw5ccwK9K0
— Doordarshan News (@DDNewsLive) November 17, 2016
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) పార్చుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లను ఇప్పటికే ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి రోజుకు రూ. 2 వేల వరకూ నగదు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అదే విధంగా మరో మూడురోజుల్లో పెట్రోల్ బంకుల్లో రూ. 20 వేల వరకూ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెట్రోల్ బంకుల్లో నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.