ఇంజనీర్ చేత గుంజీలు తీయించిన ఎమ్మెల్యే అరెస్ట్...కోర్టుకు తరలింపు..!
ఇటివల ఒడిశ్శాలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్య్ తన ప్రతాపాన్ని అధికారుల మీద చూపించబోయి బొక్కబోర్ల పడ్డాడు. ప్రజల ముందే ఓ ఇంజనీర్ను రోడ్డు పనుల్లో నాణ్యత లేదంటూ నడి రోడ్డుపై గుంజీలు తీయించాడు. దీంతో అది రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తన భర్తను అవమానాలకు గురిచేశాడంటూ ఇంజనీర్ భార్య ఎమ్మెల్యేపై పిర్యాధు చేసింది. కేసును నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అత్యుత్సాహం చూపించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు.
ఒడిశా ఎమ్మెల్యే అత్యుత్సాహం
ఇటివల ఓడిశాలోని బోలాంగిర్ జిల్లాలోని బిజద అనే నియోజకవర్గం నుండి సరోజ్ కుమార్ అనే బీజేడీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈనేపథ్యంలోన కొత్తగా ఎమ్మెల్యేగా కావడంతో ఉత్సహాంగా పలు గ్రామాలు పర్యటిస్తున్నాడు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సరోజ్ కుమార్ తన నియోజకవర్గంలోని అభివృద్దిపై సమీక్షలు చేపట్టడడంతోపాటు పలు గ్రామాలను సందర్శిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఓ గ్రామంలోని రోడ్లు సరిగా లేవని, వాటిని నాణ్యతతో నిర్మించలేదని గ్రామస్థులు ఎమ్మెల్యేకు పిర్యాధు చేశారు.
ఇంజనీర్తో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే
దీంతో స్పందించిన ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించాడు..వెంటనే అక్కడే ఉన్న సంబంధిత ఇంజనీర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇంజనీర్ చేత ప్రజలు చూస్తుండగానే గుంజీలు తీయించాడు..దీంతో ఇంజనీర్ గుంజీలు తీస్తుండగా తీసిన వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్యే చేసిన స్థానికులు కొంతమంది ప్రంశంశించగా అధికారుల్లో మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇంజనీర్ ట్రైబల్ జాతికి చెందిన వాడు కావడంతోపాటు సదరు ఇంజనీర్ భార్య చేత పిర్యాధు చేయించారు అధికారులు.
ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంజనీర్ భార్య చేత పిర్యాధును అందుకున్న జిల్లా కలెక్టర్ ఆరిందమ్ దాక్వా సంఘటనపై విచారణ జరిపించారు. దీంతో విచారణ జరిపిని అధికారులు తమ నివేదికలో ఇంజనీర్ చేత గుంజీలు తీయించిన విషయాన్ని పేర్కోన్నారు. రోడ్డు నాణ్యత లేకపోవడంతో ఇంజనీర్ చేత గుంజీలు తీయించిన విషయం వాస్తమని పేర్కోన్నారు. దీంతో ఎమ్మెల్యే సరోజ్ కుమార్పై పలు సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి జిల్లా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.