రఫేల్ యుద్ధ విమానాలతో చైనాకు గుబులు: దేనికైనా సిద్ధమేనంటూ ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా
న్యూఢిల్లీ: మన దేశ అమ్ములపొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలతో చైనా క్యాంపులో ఆందోళన నెలకొందని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Recommended Video
చైనా బలగాలు వారి జే-20 యుద్ధ విమానాలను ఈశాన్య లడఖ్ సరిహద్దు వరకు తీసుకొచ్చాయి. వారు అక్కడ్నుంచి వెళ్లిపోయినా తిరిగివచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సమయంలోనే భారత భద్రతా దళాల చేతికి రఫేల్ యుద్ధ విమనాలు వచ్చాయి. సరిహద్దులో ఉన్న వారి యుద్ధ విమానాలు సామర్థ్యం మాకు తెలుసు. అందుకే రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించామని భదౌరియా తెలిపారు.

భారత్-చైనా సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. బలగాల ఉపసంహరణ జరిగితే మంచిదే. అలా కానీ, పక్షంలో తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా. చైనా బలగాలు సరిహద్దు ప్రాంతంలోనే ఉండటంతో.. మన భద్రతా బలగాలు కూడా అక్కడే ఉండి చైనా కదలికలను గమనిస్తున్నాయని చెప్పారు.
గత నెలలో మూడవ బ్యాచ్లో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు భారతదేశంలో అడుగుపెట్టాయి. కొత్త బ్యాచ్ రాకతో, రాఫెల్ విమానాల సంఖ్య 11 కి పెరిగింది. సెప్టెంబర్ 2016లో ఫ్రాన్స్ నుంచి, రూ. 59,000 కోట్ల వ్యయంతో మొత్తం 36 యుద్ధ విమానాలను వైమానిక దళం ఆదేశించింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ జెట్, రష్యా నుంచి సుఖోయ్ జెట్లను దిగుమతి చేసుకున్న తర్వాత.. 23 సంవత్సరాలలో భారతదేశపు మొదటిసారి ప్రధాన యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంది. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న ఈశాన్య లడఖ్ ప్రాంతంలోనే రఫేల్ యుద్ధ విమానాలు ఉండటం గమనార్హం.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications