భారీ మొత్తంలో సిమ్ కార్డులు సీజ్, ఫ్యామిలీ ఆధార్ కార్డులతో సిమ్ లు తీసుకుని ?
రెండు మూడు కంటే ఎక్కువ మొబైల్ సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తున్న వ్యక్తుల మీద అధికారులు నిఘా వేస్తారు అని చాలా మంది ఊహించలేకపోతున్నారు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బెళ్తంగడి తాలూకాలో కొందరు కుటుంబ సభ్యుల పేర్లతో 42 సిమ్ కార్డులను కొనుగోలు చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
సిమ్ కార్డుల దందా కేసులో సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.సిమ్కార్డు కొనుగోలు చేశారని నమోదు అయిన కేసులో నిందితులు బంట్వాళ తాలూకా బడగకజేకరు గ్రామానికి చెందిన అక్బర్ అలీ (24), బెళ్తంగడి సంజయ్నగర్కు చెందిన మహమ్మద్ ముస్తఫా (22), నేరి గ్రుప్కల్లుకు చెందిన రమీజ్ (20)పై ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

పడంగడి గ్రామం బద్యారు నివాసి ముహమ్మద్ సాదిక్ (27)తో పాటు మరో మైనర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అందరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిందితులపై ఇప్పటికే కేసు నమోదు కావడంతో పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. అండర్కవర్ ఆపరేషన్ కేసుతో పాటు విదేశీ కరెన్సీ రాకెట్లో ఐదుగురి ప్రమేయం గురించి సీనియర్ మంగళూరు పోలీసు అధికారులు ఈడీ అధికారులకు సమాచారం అందించారు.
ప్రేమికుల రోజు హోటల్ రూమ్స్ ఎన్ని బుక్ అయ్యాయంటే ?, కాండోమ్ ల వ్యాపారం అదుర్స్ అంటున్నారు !
విదేశీయులు హస్తం ఉందా అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళూరు చేరుకుని బెళ్తంగడిలో అరెస్టు అయిన ఐదుగురు నిందితులను విచారించి సమాచారం సేకరించారు. ఈడీ అధికారులు ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

భారీ మొత్తంలో సిమ్లను కలిగి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. సాధారణంగా హవాలా నెట్వర్క్ను నిర్వహించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పెద్దఎత్తున సిమ్లు ఎందుకు తీసుకున్నారు? వాటిని ఎందుకు దాచిపెట్టారు అనే విషయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications