ఉత్కంఠ: బీజేపీ ఉవ్వీళ్లు, పీడీపీకి చెక్కోసం పావు, ఆఖర్లో ఒమర్ షాక్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు (28) గెలుచుకొన్న పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి చెక్ పెట్టేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆయన 25 స్థానాలు గెలుచుకొని రెండో స్థానంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 25, పీడీపీ 28, కాంగ్రెస్ 2, ఎన్సీపీ 15 స్థానాలు గెలుచుకుంది. ఏడుగురు ఇతరులు గెలిచారు. ఈ నేపథ్యంలో మేజిక్ ఫిగర్ (44) పైన పీడీపీ, బీజేపీ కసరత్తు చేస్తోంది. 99 శాతం బీజేపీతో కలవమని చెప్పిన ఒమర్ అబ్దుల్లా రాష్ట్రంలో పీడీపీకీ చెక్ పెట్టేందుకు కమలంతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీలను ఒమర్ కలిశారు. మరోవైపు, బీజేపీ కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్వీళ్లూరుతోంది. ఇందుకోసం తమతో కలిసి వచ్చే పార్టీకి పలు పదవులు ఇవ్వాలని చూస్తోంది.

కేంద్రమంత్రి, రాజ్యసభ, ఉపముఖ్యమంత్రి పదవులు
దాదాపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీడీపీకి చెక్ చెప్పాలన్నా ఆ పార్టీకి ప్రత్యామ్నాయాం బీజేపీ మాత్రమే. అంతేకాకుండా, వాజపేయి హయాంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీయేలో భాగస్వామి. ఇప్పుడు కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీకి మద్దతిస్తే.. కమలం పార్టీ ఆ పార్టీకి ఓ రాజ్యసభ పదవి, ఓ కేంద్రమంత్రి పదవితో పాటు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, బీజేపీ నేతలు రామ్ మాధవ్, అరుణ్ జైట్లీలు జమ్మూ కాశ్మీర్లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
షాకిచ్చిన ఒమర్
ఇదిలా ఉండగా.. ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ చివర్లో ఒమర్ అబ్దుల్లా షాకిచ్చారు. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చేది లేదని ఒమర్ చెప్పారు. ఏ ఇతర పక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తాము మద్దతివ్వమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఆగా రోహుల్లా చెప్పారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications