మళ్లీ ఉల్లంఘన: పాక్ బలగాల కాల్పులు, జవాన్ మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ బలగాలు జమ్మూ ప్రాంతంలోని ఆర్ఎస్ పురా సెక్టారులో భారత్ శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఒక బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.
సీనియర్ పోలీసులు అధికారు ఒకరు ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ... జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు ఆర్ఎస్ పురా సెక్టారు వద్ద పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడన్నారు. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉన్న ఇరవై ప్రాంతాల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.

82 ఎంఎం మోర్టార్స్, భారీ ఆయుధాలు తదితరాలను మోహరిస్తోందని అధికారు చెప్పారు. బుధవారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో కాల్పులు సాగినట్లు చెప్పారు. బిఎస్ఎఫ్ జవాన్ పాక్ కాల్పులను ధీటుగా తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారన్నారు.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూలో పర్యటించారు. పాక్ బలగాలు కాల్పులకు పాల్పడిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు.
కాగా మీడియా రిపోర్ట్స్ ప్రకారం... పాకిస్తాన్ బలగాలు మోడల్ విలేజ్ వద్ద గల కీరన్ సెక్టారులోని పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాక్ మంగళవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications