Online classes: ఆన్ లైన్ పాఠాల దెబ్బకు అమ్మాయి ఆత్మహత్య, సీఎం అవార్డు గ్రహీత, టీచర్లు పని !
చెన్నై/ మదురై/ శివగంగై: కరోనా వైరస్ పుణ్యమా అంటూ లాక్ డౌన్ అమలు చెయ్యడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న కొందరు టీచర్లు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకువచ్చి మీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి జాగ్రత్త ? అంటూ భయపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక సతమతం అయ్యింది. ఎక్కడ తాను 10వ తరగతిలో ఫెయిల్ అవుతానో అనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆన్ లైన్ పాఠాలు అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర గతంలో శభాష్ అనిపించుకుని అవార్డు తీసుకుంది. ఆమె తెలివితేటలతో, వాక్ చాతుర్యంతో సీఎంతో పాటు మంత్రులు, అధికారులను కట్టిపడేసింది. అయితే ఆన్ లైన్ పాఠాల దెబ్బలకు అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నీట్ విద్యార్థుల దెబ్బతో కలకలం
తమిళనాడులో నీట్ పరీక్షల దెబ్బకు ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకం రేపింది. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలోని ప్రతిప్రక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం అంటూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

ఆటో డ్రైవర్ కూతురు
తమిళనాడులోని శివగంగై సమీపంలోని సెల్లప్పనందల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సత్యమూర్తి కుమార్తె సుభిక్ష (15) అనే అమ్మాయి మదురైలో 10వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో మార్చి 25వ తేదీ నుంచి సుభిక్ష చదువుతున్న స్కూల్ మూతపడింది. అప్పటి నుంచి సుభిక్ష ఇంటి దగ్గరే చదువుకుంటున్నది.

ఆన్ లైన్ పాఠాల దెబ్బ
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కారణంగా సుభిక్ష చదువుతున్న స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఇంటి దగ్గర ఉంటున్న సుభిక్ష కొంతకాలం నుంచి ఆన్ లైన్ తరగతులకు హాజరౌతున్నది. అయితే స్కూల్ టీచర్లు చెబుతున్న ఆన్ లైన్ పాఠాలు అర్థంకాకపోవడంతో సుభిక్ష సతమతం అయ్యింది.

టీచర్ల దెబ్బకు ఆత్మహత్య
ఆన్ లైన్ పాఠాలు అర్థం కాకపోవడంతో కొన్ని రోజులు సుభిక్ష ఆందోళన చెందింది. సోమవారం ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న టీచర్లతో మాట్లాడిన సుభిక్ష సార్ ఈ పాఠాలు తనకు అర్థంకావడం లేదని చెప్పింది. నువ్వు ఇలాగే ఉంటే 10వ తరగతి పాస్ కావడం చాలా కష్టం అని, నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని చెప్పారని తెలిసింది. టీచర్ల ఒత్తిడితో మరింత ఆందోళన చెందిన సుభిక్ష రాత్రి తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సీఎం షాక్, ప్రభుత్వ అవార్డు
ఎంతో తెలివితేటలు ఉన్న సుభిక్ష ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, సాటి విద్యార్థులు, స్థానికులతో పాటు ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారు. 2017లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ శతాబ్ధిఉత్సవాలు నిర్వహించింది. ఆరోజు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారుల సమక్షంలో బహిరంగ సమావేశంలో ప్రసంగించిన సుభిక్ష తన స్పీచ్, తెలివితేటలతో అందర్ని కట్టిపడేసింది. ఆ రోజు జిల్లాస్థాయిలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి నుంచి సుభిక్ష అవార్డుతో పాటు బహుమతి అందుకుంది. అలాంటి తెలివైన సుభిక్ష ఈరోజు ఆన్ లైన్ పాఠాలు అర్థంకాక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications