2024లో ఉమ్మడిగా పోటీ- విపక్షాల ప్రకటన-పట్నా మీటింగ్ లో కాంగ్రెస్ వర్సెస్ ఆప్-రాహుల్ కీలక హామీ..
2024లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసే పోటీ చేయాలని ఇవాళ బీహార్ రాజధాని పట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు ప్రకటించాయి. తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం కలిసి అవగాహనతో పోటీ చేయాలని నిర్ణయించాయి. పట్నాలో నిర్వహించిన విపక్షాల కీలక భేటీకి హాజరైన విపక్షాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన చేశారు.
అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయని, అయితే వివరాలను ఖరారు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో వచ్చే నెలలో మరో సమావేశం జరుగుతుందని ఈ భేటీ నిర్వహించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.16 విపక్ష పార్టీలు హాజరైన ఈ భేటీ నాలుగు గంటలపాటు జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉమ్మడి మీడియా సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. విమాన ప్రయాణాల కారణంగా వారిద్దరు ప్రెస్ మీట్ కు హాజరు కాలేదని నితీశ్ తెలిపారు.

మరోవైపు విపక్షాల భేటీ తర్వాత మాట్లాడిన ఆప్ నేతలు.. కాంగ్రెస్ ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను బహిరంగంగా వ్యతిరేకించే వరకూ భవిష్యత్తులో జరిగే విపక్ష భేటీల్లో భాగస్వాములు కాబోమని బాంబుపేల్చారు. అలాగే విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ వైఖరి అడగగా.. ఖర్గే.. బీజేపీతో ఒప్పందం కారణంగా కాంగ్రెస్ వైఖరి తీసుకోవడం లేదన్న ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆరోపణను ప్రస్తావించారు.
మరోవైపు విపక్షాల భేటీలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తోటి విపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తామని కీలక హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాము బలంగా ఉన్న చోట్ల మద్దతివ్వాలని ప్రాంతీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ ప్రకటన చేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications