మోడీ నచ్చినా, నచ్చకున్నా ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించాలి: ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేయడంపై మరోమారు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల ప్రయోజనాల కోసం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ప్రకటించిన విపక్ష పార్టీలకు నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. మీకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నచ్చినా నచ్చకపోయినా, ఆయనను చూడడం ఇష్టం ఉన్నా.. లేకపోయినా, మీరు ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించాల్సిందేనని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తేల్చిచెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించే ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం మంచిది కాదన్నారు.

విపక్షాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెన్నై లో విలేకరులతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, మోడీ కూడా పార్లమెంట్ లోపలకి నమస్కరించి అడుగు పెడతారని గుర్తు చేశారు. పార్లమెంటుపై ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష పార్టీలు గైర్హాజర్ అవుతామని బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రారంభోత్సవానికి తమిళనాడు నుండి 20 మంది ఆదీనాలు, లేదా మఠాల అధిపతులను ఆహ్వానించినట్టు సీతారామన్ తెలిపారు. తమిళ రాజ్యాలలో పాలనా చిహ్నం అయిన సెంగోల్ స్పీకర్ సీటు సమీపాన ఏర్పాటు చేయబడుతుంది అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరచింది అన్న ఆరోపణ తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
తాము రాష్ట్రపతికి తగిన గౌరవం ఇస్తున్నామని నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో గిరిజన నేపథ్యమున్న మహిళగా రాష్ట్రపతి గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో తమకు ఇంకా గుర్తుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి గురించి ఎవరు ఎన్ని దుర్భాషలాడుతూ మాట్లాడారో తనకు తెలుసన్నారు.

ఇప్పుడు అలాంటి వారంతా రాష్ట్రపతికి అవమానం జరుగుతోందని మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల కోసమైనా ప్రతిపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని మార్చుకుని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications