లోక్ సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..! అక్కడ లక్షన్నర ఫేక్ ఓట్లు..! రాహుల్ మరో షాక్..!
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ పై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతేడాది లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ కు గురయ్యాయని, ఇక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండలేదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పేసారు. లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, 2024 ఎన్నికల్లో అదే జరిగిందని రాహుల్ ఆరోపించారు. తమ వద్ద దీనికి బలం చేకూర్చే డేటా కూడా ఉందని తెలిపారు. తాము దీన్ని నిరూపించబోతున్నామని రాహుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఎంపీ సీట్లో జరిగిన వివరాలను శాంపిల్ గా బయటపెట్టారు. అయితే ఆ నియోజకవర్గం పేరు చెప్పలేదు.

తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఓ లోక్ సభ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లు ఉంటే అందులో 1.5 లక్షల ఓట్లు నకిలీవే అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు తాము ఓటరు లిస్ట్ ను పరిశీలించినట్లు రాహుల్ బయటపెట్టారు. ఈ మోసంపైనే అధికార బిజెపి మెజారిటీ ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. బీజేపీకి మరో 15-20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోడీ ప్రధాని మోడీ అయ్యేవారు కాదన్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ ఆగస్టు 5న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ శాంపిల్ గా ఓ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై హింట్ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే తమపై చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవద్దంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి ఈసీని టార్గెట్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications