పాక్కు న్యూ ఇయర్ షాక్: ఫూల్స్ చేశారంటూ ట్రంప్ ఫైర్, తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: కొత్త ఏడాది తొలిరోజే పాకిస్థాన్కు అమెరికా భారీ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేగాక, నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి.. మోసం చేసిందని ఆరోపించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ట్రంప్ పాక్ తీరుపై ధ్వజమెత్తారు. అంతేగాక, తమ దేశం ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పారు.

ఫూల్స్ చేశారనుకుంటున్నారు..
‘గత 15ఏళ్ల నుంచి పాకిస్థాన్కు అమెరికా తెలివితక్కువగా.. దాదాపు 33 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇచ్చింది. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెప్పారు. వాళ్లు మా నేతలను ఫూల్స్ అనుకుంటున్నారు' అని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆటలు సాగవు
అంతేగాక, ‘పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది. ఇక ఆ ఆటలు సాగబోవు' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక పాకిస్థాన్ కు ఆర్థిక సాయముండదని తేల్చి చెప్పారు.

ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా..
గతంలో కూడా పలుమార్లు ట్రంప్ పాక్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందంటూ ఆగస్టులో వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపై పాక్ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే.. ఆ దేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తందని ట్రంప్ హెచ్చరించారు. అయినా పాక్ తన వైఖరి మార్చుకోకపోవడంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక సాయం అందబోదు..
తామిచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే పాక్కు అమెరికా నుంచి అందే 255 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపేయాలని భావిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే ఇక పాక్కు యూఎస్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందబోదని స్పష్టమవుతోంది.

పాక్ స్పందన
కాగా, ట్రంప్ ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది. ప్రపంచానికి నిజా నిజాలు తెలుసునని పాక్ పేర్కొంది. అంతేగాక, పాక్ ప్రధాని షహీద్ అబ్బాసి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు












Click it and Unblock the Notifications