పాక్కు న్యూ ఇయర్ షాక్: ఫూల్స్ చేశారంటూ ట్రంప్ ఫైర్, తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: కొత్త ఏడాది తొలిరోజే పాకిస్థాన్కు అమెరికా భారీ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేగాక, నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి.. మోసం చేసిందని ఆరోపించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ట్రంప్ పాక్ తీరుపై ధ్వజమెత్తారు. అంతేగాక, తమ దేశం ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పారు.

ఫూల్స్ చేశారనుకుంటున్నారు..
‘గత 15ఏళ్ల నుంచి పాకిస్థాన్కు అమెరికా తెలివితక్కువగా.. దాదాపు 33 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఇచ్చింది. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెప్పారు. వాళ్లు మా నేతలను ఫూల్స్ అనుకుంటున్నారు' అని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.

ఆటలు సాగవు
అంతేగాక, ‘పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది. ఇక ఆ ఆటలు సాగబోవు' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక పాకిస్థాన్ కు ఆర్థిక సాయముండదని తేల్చి చెప్పారు.

ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా..
గతంలో కూడా పలుమార్లు ట్రంప్ పాక్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందంటూ ఆగస్టులో వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపై పాక్ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే.. ఆ దేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తందని ట్రంప్ హెచ్చరించారు. అయినా పాక్ తన వైఖరి మార్చుకోకపోవడంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక సాయం అందబోదు..
తామిచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే పాక్కు అమెరికా నుంచి అందే 255 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపేయాలని భావిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే ఇక పాక్కు యూఎస్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందబోదని స్పష్టమవుతోంది.

పాక్ స్పందన
కాగా, ట్రంప్ ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది. ప్రపంచానికి నిజా నిజాలు తెలుసునని పాక్ పేర్కొంది. అంతేగాక, పాక్ ప్రధాని షహీద్ అబ్బాసి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications