ప్రధాని మోడీకి పాక్ జాతీయురాలు రాఖీ.. 20 ఏళ్లుగా రాఖీ పంపిస్తూ..
రాఖీ పౌర్ణమి.. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం చాటుతుంది. ప్రముఖులకు రాఖీ కట్టేందుకు అతివలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ప్రధాని మోడీకి రాఖీని పాకిస్థాన్కు చెందిన మహిళ ఖమర్ మొహిసిన్ షేక్ కడుతున్నారు. ఈ ఒక్కసారే కాదు.. గత 20 ఏళ్ల నుంచి ఆమె రాఖీ పంపిస్తున్నారు. ఈ నెల 11న రక్షాబంధన్ పండుగ కాగా, ఖమర్ మొహిసిన్ మోడీకి రాఖీ పంపారు.

పాక్ జాతీయురాలు అయిన ఖమర్ పెళ్లి తర్వాత అహ్మదాబాద్లో ఉంటున్నారు. ఆమె మోడీని తన సోదరుడిగా భావిస్తారు. ఈసారి ఆమె స్వయంగా రూపొందించిన రాఖీని పంపించడం విశేషం. రేష్మీ రిబ్బన్ పై ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఆ రాఖీతోపాటు ఖమర్ ఓ లేఖను కూడా మోడీకి పంపారు. తనను ఈసారి మోడీ ఆహ్వానిస్తారని భావిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రాఖీ పండగ పల్లెల్లో మొదలైంది. పెళ్ళయ్యాక ఆడపిల్లలు భర్త ఇంటికి వెళ్తారు. ప్రత్యేకమైన రోజున అమ్మ వాళ్ళింటికి వస్తుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్ళినా కూడా అంతే బలంగా ఉండాలన్న లక్ష్యంతో పండగ జరుపుకుంటారు. ఈ రోజున అక్కలు, చెల్లెల్లు తమ అన్నా తమ్ముళ్ళకు రాఖీ కడతారు. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్ళకు బహుమతిగా అన్నాదమ్ములు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
Smart Nails : మీ డ్రస్సింగ్కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు".. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications