పాక్ తోక వంకరే: మరోసారి కాల్పులు, తిప్పికొట్టిన భారత్
శ్రీనగర్: భారత్ ఎలా సమాధానమిచ్చినా.. పాకిస్థాన్ తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. ఓవైపు నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు చేపట్టిన దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.
గడిచిన 48 గంటల్లో ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు.. భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి.

అఖ్నూర్ సెక్టార్లోని చప్రియల్, సమ్వాన్ ప్రాంతాల్లో పాక్ బలగాలు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపాయి. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు.. పాక్ బలగాలకు ధీటుగా సమాధానమిచ్చారు.
దాదాపు గంటపాటు జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్దీప్ సింగ్ తెలిపారు.
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాదాపు వెయ్యి గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్లు సరిహద్దు పరిస్థితిపై అధికారులు, భద్రతా దళాలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!











Click it and Unblock the Notifications