భారత్లోకి అక్రమంగా పాక్ గూఢచారి: పట్టేసిన బీఎస్ఎఫ్, విచారణలో ఏం చెప్పాడంటే.?
జైపూర్: పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మానుకోవడం లేదు. ఏదో రకంగా భారతదేశానికి కీడు చేయాలనే ఆలోచనలోనే ఆ దేశం ఎప్పుడూ ఉంటోంది. తాజా ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గూఢచర్యం చేసేందుకు పాకిస్థాన్ నుంచి మనదేశంలో అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకున్నాయి.
రాజస్థాన్ బర్మేర్లోని భారత్-పాక్ సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ గూఢచారిని పట్టుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలిపాడు. పాకిస్థాన్లోని ఖొఖ్రాపర్ వరకు రైలులో వచ్చిన అతడు.. అక్కడి నుంచి పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటినట్లు చెప్పుకొచ్చాడు.

అతడు సరిహద్దులో బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ దేశంలోకి చొరబడి ఉంటాడని భద్రతా దళాలు భావిస్తున్నాయి. కాగా, బీఎస్ఎఫ్ జవాన్ల విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. బీఎస్ఎఫ్, భారత సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను తెలుసుకునేందుకు అతడు మనదేశంలో ప్రవేశించినట్లు తెలిసింది.
తన మేనమామే తనను ఇక్కడికి పంపాడని బీఎస్ఎఫ్ విచారణలో సదరు గూఢచారి చెప్పినట్లు సమాచారం. అయితే, దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మార్చుతుండటంతో అతడ్ని జైపూర్ కు తరలించి మరోసారి విచారించనున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications