భారత జలాల్లోకి పాకిస్థాన్ పడవ.. 9 మంది సిబ్బందిని అదుపులోకి
భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక పాకిస్థానీ బోటును భారత కోస్టు గార్డు తాజాగా స్వాధీనం చేసుకుంది. ఈ బోటులో మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. దేశ తీరప్రాంతంలో కోస్టు గార్డు దళాలు నిర్వహించిన సాధారణ నిఘాలో భాగంగా ఈ నౌకను అడ్డుకున్నారు. భారత అధికార పరిధిలోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్లు గుర్తించిన తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన సిబ్బంది అంతా పాకిస్థానీ జాతీయులుగా అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ డిఫెన్స్ పీఆర్వో, వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ 'ఎక్స్' వేదికగా ఈ ఘటన వివరాలను వెల్లడించారు. "వేగవంతమైన, పకడ్బందీ రాత్రి ఆపరేషన్ లో ఒక భారత కోస్టు గార్డు నౌక అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. 2026 జనవరి 14న ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ (IMBL) సమీపంలోని భారత జలాల్లో ఒక పాకిస్థానీ చేపల వేట బోటును గుర్తించింది" అని తెలిపారు.
"సవాలు చేసినప్పుడు.. ఆ బోటు పాకిస్థానీ వైపు పారిపోవడానికి ప్రయత్నించింది అయితే, భారత కోస్టు గార్డు నౌక భారత జలాల్లోనే ఈ బోటును అడ్డుకుందని, "అల్- మదీనా" అనే ఆ పాకిస్థానీ బోటులో మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భారత సముద్ర అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి అనేక ఘటనలు జరిగాయి. 2025 డిసెంబర్ లో భారత కోస్టు గార్డు మరో పాకిస్థానీ చేపల వేట బోటును అడ్డుకుంది. భారత ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ)లో అక్రమంగా ప్రవేశించి చేపల వేట చేస్తున్న ఈ బోటులో 11 మంది సిబ్బంది ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం స్థానిక మెరైన్ పోలీసులకు అప్పగించారు.
అంతకుముందు, 2023 నవంబర్ చివరిలో కోస్టు గార్డు 'నజ్-రే-కరం' అనే పాకిస్థానీ చేపల వేట నౌకను అరేబియా సముద్రంలో పట్టుకుంది. ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ వద్ద భారత జలాల్లో సుమారు 15 కి. మీ లోపల చేపలు పడుతుండగా దానిని గుర్తించారు. ఈ నౌకలో 13 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు వివరించారు.

సంవత్సరాలుగా, భారత సముద్ర ఏజెన్సీలు పాకిస్థానీ సహా, అనుమతి లేకుండా భారత సముద్ర మండలాల్లోకి ప్రవేశించిన విదేశీ చేపల వేట నౌకలను, మత్స్య కారులను పట్టుకుంటున్నాయి. ఇది పశ్చిమ తీరంలో నిరంతర నిఘా, చట్టాల అమలుకు నిదర్శనం. ఇటీవల నెలలుగా, భారత సముద్ర ప్రాంతాలలో అక్రమ ప్రవేశాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై భద్రతా ఆపరేషన్లను పెంచిన నేపథ్యంలోనే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications