పాక్ భస్మాసర హస్తం: చావు దెబ్బ తినింది
శ్రీనగర్: భారత సైనికుల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాక్ తోకముడుసోంది. పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ సైనికులకు చివరికి భస్మాసుర హస్తం గుర్తుకు వచ్చింది. ఎందుకు రెచ్చగొట్టామా దేవుడా అంటూ పాక్ సైనికులు అయోమయానికి గురైనారు.
శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్ సమీపంలో పాక్ సైనికులు భారత సైనిక స్థావరాల మీద కాల్పులు జరిపారు. అప్పటి వరకు ఓపికతో ఉన్న భారత సైనికులు తమ విశ్వరూపం చూపించారు.
పాక్ సైనికులకు ధీటుగా ఎదురు కాల్పులు జరిపారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా ఉగ్రవాదులు భారత్ లో అల్లర్లు సృష్టించి విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని గత నెల నుంచి భారత ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.
అయితే ఇదే సమయంలో భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ ప్రయత్నించడంతో చావు దెబ్బ తినింది. ఇప్పటి వరకు 15 మంది పాక్ జవాన్లు అంతం అయ్యారని బీఎస్ఎఫ్ అధికారులు అంచనావేశారు.
భారత సైనికులకు ఒక్కరికి గాయాలు కాలేదని బీఎస్ఎఫ్ బలగాలు దృవీకరించాయి. పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నామని, పరిస్థితి ఇప్పుడే అంచానా వెయ్యలేమని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం పాక్ ను పరోక్షంగా హెచ్చరించింది. ఉగ్రవాదం అనేది భస్మాసర హస్తం లాంటిది, దానితో మీరు జాగ్రతగా ఉండండి అని చెప్పింది. అయితే ఏదో చెయ్యాలని ప్రయత్నించిన పాక్ కు భస్మాసర హస్తం గుర్తుకు వచ్చిందింది. చివరికి తన గొయ్యి తానే తొవ్వుకుంది.