పనామా పేపర్స్: ఐశ్వర్యరాయ్ను ఐదు గంటలపాటు విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: పనామా పేపర్ల వ్యవహారంపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈడీ విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. సోమవారం రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
పనామా పేపర్లతో ఉన్న సంబంధంపై ప్రధానంగా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫారెక్స్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐశ్వర్యను విచారించిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో డబ్బు దాచుకున్నట్లు ఐశ్వర్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఆమెను విచారించారు.

అయితే, తదుపరి విచారణకు రావాలని పిలిచారా లేదా అనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. గతంలో కూడా రెండుసార్లు ఐశ్వర్యరాయ్ కి ఈడీ సమన్లు పంపినప్పటికీ.. ఆమె వాయిదా కోరారు. దీంతో తాజాగా, సమన్లు పంపడంతో ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత 15 ఏళ్లలో విదేశాల నుంచి అందుకున్న చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఐశ్వర్యరాయ్ సమర్పించినట్లు తెలిసింది.
పార్లమెంటులో సహానం కోల్పోయిన జయాబచ్చన్, బీజేపీపై ఫైర్
సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ పార్లమెంటు సమావేశాల్లో సహనం కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఓవైవు ఢిల్లీలో తన కోడలు (ఐశ్వర్యరాయ్ బచ్చన్)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తుండగానే రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడ్డారు జయాబచ్చన్. బీజేపీకి త్వరలోనే చెడ్డరోజులు రాబోతున్నాయని శాపనార్థాలు పెట్టారు.
తన కుటుంబంపై బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని జయాబచ్చన్ మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. రాజ్యసభలో ఐశ్వర్యారాయ్ పేరును బీజేపీ ఎంపీలు ప్రస్తావించడంపై ఆవేశంతో ఊగిపోయారు జయాబచ్చన్. కాగా, పనామా పేపర్స్లో ఐశ్వర్యారాయ్ పేరు బయటకు రావడంతో ఆమెను ఈడీ విచారించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications