ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో సంచలనం, మారుతున్న లెక్కలు...!!
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం. అసెంబ్లీ ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. తమిళనాడులో ఎలాగైనా ఈ సారి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ అన్నా డీఎంకేతో జత కట్టింది. అటు డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతో ఉంది. సినీ హీరో విజయ్ రాజకీయంగా తొలి అడుగులోనే సక్సెస్ రేట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం స్టాలిన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తిరిగి అధికారమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకేతో జత కట్టటం ద్వారా తమిళనాడులో బలం పెరుగుతుందని బీజేపీ నేతలు కొత్త లెక్కలు వేసారు. అటు విజయ్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో కలిసి వస్తుందని భావించారు. ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తున్నారు. రాజకీయంగా.. ప్రత్యర్థుల పైన సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్య మంత్రి.. అన్నా డీఎంకే వాలంటీర్ల హక్కుల పునరుద్ధరణ కమిటీ సమన్వయకర్త O. పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసారు. ఇద్దరూ ఒన్ టు ఒన్ సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎన్నికలు... ప్రస్తుత పరిస్థితులు.. భవిష్యత్ వ్యూహాల పైన చర్చించారు. స్టాలిన్ పాలన బాగుందని.. తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి.

ఎన్నికల పొత్తుల వేళ మారుతున్న లెక్కలు
పన్నీర్సెల్వం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం స్టాలిన్ను స్వయంగా కలవటం.. ఆయన పాలనను ప్రశంసించటం ద్వారా రాజకీయంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలు అయ్యాయి. స్టాలిన్-ఓపీఎస్ సమావేశం తర్వాత, ఓపీఎస్ డీఎంకే పార్టీలో చేరబోతున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఓపీఎస్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఆయనను వదిలిపెడుతున్నందున, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. డీఎంకే ఐదేళ్ల పాలనను పొగిడిన పన్నీర్సెల్వం.. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని ద్వారా ఇక పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరటం లాంఛనంగానే మారుతోంది. అటు విజయ్ కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డీఎంకే, ఎన్డీఏ రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తూ.. అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసారు. దీంతో.. ఎన్నికల ముందే రాజకీయంగా రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications