వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహర్‌కు ప్రత్యేక హోదా: లోక్‌సభలో ఎంపీ పప్పూయాదవ్ నోటీసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:బీహర్ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌‌పై చర్చను కోరుతూ జన్ అధికార్ పార్టీ (జెఎపి) ఎంపీ పప్పూ యాదవ్ బుధవారం నాడు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై టిడిపి, వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి,. అయితే ఈ నోటీసులపై ఇంతవరకు చర్చ ప్రారంభం కాలేదు. ఈ తరుణంలో బీహర్‌ రాష్ట్రానికి కూడ ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలనే డిమాండ్‌తో జన్ అధికార్ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్ నోటీసు ఇవ్వడం సంచలనం రేపుతోంది.

Pappu Yadav gives notice in LS over special status for Bihar

రెండు రోజుల క్రితం బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 13 ఏళ్ళ క్రితమే తాను ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఈ డిమాండ్‌ను విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు.

బీహర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను 2005లోనే ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అంతేకాదు ఏడాది తర్వాత బీహర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహర్ అసెంబ్లీలో కూడ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై బిజెపి నేతలు తలలు పట్టుకొంటున్న సందర్భంలో బీహర్ రాష్ట్రానికి చెందిన నేతలు కూడ ఇదే అంశాన్ని తీసుకురావడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

English summary
Demanding special status for Bihar, Jan Adhikar Party (JAP) MP Pappu Yadav on Wednesday gave a notice to Lok Sabha Secretary-General asking for urgent discussion on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X