అప్పుతీర్చలేదని.. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యాపారి
ఇడుక్కి: కేరళ రాష్ట్రంలోని ఇడుక్కిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుతీర్చలేని కారణంగా తమ మైనర్ కూతురును ఓ తల్లిదండ్రులకు రుణదాతకు ఇచ్చి వివాహం చేశారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇడుక్కి జిల్లా నెడుంకందం ప్రాంతానికి చెందిన తిరుపతి, కృష్ణవేణి దంపతులు తమిళనాడులోని థేని ప్రాంతానికి చెందిన వ్యాపారి సెల్వకుమార్(35) దగ్గర కొన్నాళ్ల క్రితం అప్పు చేశారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో సెల్వకుమార్ పైశాచికానికి ఒడిగట్టాడు.
అప్పు ఇచ్చేటప్పుడే తాను కొన్ని డిమాండ్లు పెట్టానని, అందులో భాగంగా తమ కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని తిరుపతి దంపతులపై ఒత్తిడితెచ్చాడు. విధిలేని పరిస్థితుల్లో ఆ దంపతులు తమ 15ఏళ్ల కూతుర్ని సెల్వకుమార్కు ఇచ్చి మంగళవారం వివాహం చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాలిక మేనమామ కన్నన్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, సెల్వకుమార్తో పాటు బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.