ఆరో రోజు అదే సీన్: ఉభయ సభలు వాయిదా, వెంకయ్య నాయుడు ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ఆరో రోజు కూడా అదే ఆందోళనలు, నిరసనలు పునరావృతం అయ్యాయి. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు సభలో నిరసన తెలిపారు.
ఆ రెండు పార్టీల సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసనలు తెలిపారు. లోకసభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.

రాజ్యసభలోను గందరగోళం కనిపించింది. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications