వేగంగా వెలుతున్న వందే భారత్ రైలులో యోగా చేసిన ప్రయాణికులు, ఎలా !
న్యూఢిల్లీ/భోపాల్: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా బుధవారం భోపాల్ నుంచి ఢిల్లీకి వెలుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రైలులో యోగా చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు కృష్ణకాంత్ మిశ్రా రైలులోని ప్రతి కోచ్లో కూర్చునే భంగిమలో యోగా చేయాలని ప్రయాణికులకు మార్గనిర్దేశం చేశారు. కదులుతున్న రైలులో యోగా చేసిన ప్రయాణికులు చరిత్రకు తెరలేపారు.
దీని గురించి యోగా గురువు మిశ్రా మాట్లాడుతూ వందే భారత్లోని ప్రయాణికులతో కూర్చొని కొన్ని యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైలులో కూడా యోగా చెయ్యడానికి వీలుందని సందేశం ఇవ్వాలనుకున్నామని యోగా గురువు మిశ్రా చెప్పారు. యోగా దినోత్సవాన్ని 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా నిరంతరంగా మనం ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని యోగా గురువు మిశ్రా తెలిపారు.

ఇదిలా ఉండగా జబల్పూర్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక అడుగు ముందుకు వేస్తూ తమిళనాడులోని రామేశ్వరంలో యోగా అభ్యాసకుల బృందం వాటర్ యోగాను ప్రదర్శించింది. జల్ యోగా అనేది యోగా యొక్క సాపేక్షంగా ఒక రూపం, దీనిలో ఒక వ్యక్తి నీటిలో ఆసనాలు వేశాడు. రామేశ్వరంలో నిర్వహించిన జల్ యోగా హైలెట్ గా నిలిచింది.

రామేశ్వరంలోని సముద్రం వద్ద యోగా సాధకులు ఎన్జే బోస్, సుదలై మూడు గంటల పాటు నీటిలో ఆసనాలు వేశారు. ప్రజలు తమ శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరచుకోవాలని ఆయన ప్రోత్సహించారు. వాటర్ యోగా మంచి శ్వాస వ్యాయామంగా పనిచేస్తుందని, సరైన భంగిమను నిర్వహించడానికి మరియు అంతర్గత శాంతిని పెంచుతుందని అన్నారు.
బుధవారం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన ఓ కుక్క కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లోని ప్రాణి క్యాంప్లో యోగా చేసి ఆశ్చర్యపరిచింది. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే పారామిలటరీ సిబ్బంది ముందు కుక్క కూడా వివిద భంగిమలో యోగా చెయ్యడంతో అందరూ అశ్చర్యం వ్యక్తం చేశారు.

స్క్వాడ్కు చెందిన కుక్క తోక ఊపుతూ నేలపై తిరుగుతున్నట్లు చూపిస్తుంది. రకరకాల ఆసనాలు వేయడంలో జనంతో కలిసిపోయేందుకు ఆ కుక్క ప్రయత్నించిందని, అప్పుడప్పుడు అది తన ప్రమేయాన్ని చూపించడానికి ఆ కుక్క మొరిగినట్లు ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. మొత్తం మీద భారతదేశంలో బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications