దాని గురించి నాకు తెలియదు: 'గాలి 100 కోట్ల మార్పిడి'పై యడ్యూరప్ప
గాలి జనార్ధన్ రెడ్డి వంద కోట్ల మార్పిడి గురించి తనకు తెలియదని, ఆ వివరాలేవి తనకు తెలియదని యెడ్యూరప్ప చెప్పారని తెలుస్తోంది.
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి రూ.100 కోట్ల రద్దయిన నోట్లను మార్చుకున్నారనే ఆరోపణల పైన బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప ఓ టీవీ ఛానల్తో స్పందించారని తెలుస్తోంది.
గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన వంద కోట్ల రూపాయల నల్లధనాన్ని ఓ అధికారి సహాయంతో తెల్లగా మార్చుకున్నారని డ్రైవర్ ఆత్మహత్యతో వెలుగు చూసింది.
దీనిపై ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదని, ఆ వివరాలేవి తనకు తెలియదని యెడ్యూరప్ప చెప్పారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపితే నిజాలు అన్ని వాటంతట అవే బయటకు వస్తాయన్నారు. అధికారి భీమా నాయక్, డ్రైవర్ రమేష్ గౌడ మధ్య వ్యవహారంగా ఎంపి శ్రీరాములు కొట్టి పారేశారు.

కాగా, కేఏఎస్ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్గా పని చేసే రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కర్నాటకలో సంచలనం రేపింది.
గాలి.. అధికారి భీమా నాయక్ సాయంతో ఇరవై శాతం కమీషన్తో రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నాడని, ఇందుకు కమీషన్తో పాటు 2018 ఎన్నికల్లో సీటు ఇప్పించడంలో సాయం చేయాలని కూడా అడిగినట్లుగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications