రెండు రోజులే గ్యాప్: పెట్రోల్, డీజిల్ మళ్లీ భగ్గు: ఈ సారి మరింత: లీటర్ రూ.103కు దగ్గరగా
న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు మొలిచాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాటి రేట్లు పెంచాయి. ఈ నెల 4వ తేదీన ఆరంభమైన పెట్రోలు, డీజిల్ ధరల దూకుడు ఏడవ తేదీ వరకూ కొనసాగింది. వరుసగా నాలుగు రోజుల పాటు వాటి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 8,9 తేదీల్లో ఇంధన ధరల్లో మార్పులేవీ చోటు చేసుకోలేదు. సోమవారం మళ్లీ కదలిక కనిపించింది. రెండు రోజుల గ్యాప్ అనంతరం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
Recommended Video
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 26 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 33 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.53, డీజిల్ 82.06 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 97.86 రూపాయలు ఉంటోంది.
డీజిల్ ధర 89.17 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 93.38, డీజిల్ ధర రూ. 86.96, కోల్కతలో పెట్రోల్ రూ.91.66 పైసలు, డీజిల్ ధర రూ.84.90 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-93.77, డీజిల్-87.27, బెంగళూరులో పెట్రోల్-94.57, డీజిల్-86.99, హైదరాబాద్లో పెట్రోల్-95.13, డీజిల్-89.47 పైసలుగా నమోదైంది. లక్నోలో పెట్రోల్-89.56, డీజిల్-82.43, నొయిడాలో పెట్రోల్-89.64, డీజిల్-82.43గా రికార్డయ్యాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి.
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల మార్క్ను దాటింది. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 102.42 పైసలుగా రికార్డయింది. మధ్యప్రదేశ్లోని నగరాబంధ్, అనూప్పూర్, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. నగరాబంధ్లో లీటర్ పెట్రోలు 102.67 పైసలు, అనూప్పూర్లో 102.12కు చేరింది.
రీవాలో పెట్రల్ లీటర్ ఒక్కింటికి 101.76, ఛింద్వాడలో 101.39 పైసలు పలుకుతోంది. ఇదివరకు వంద రూపాయల మార్క్ను దాటిన పట్టణం.. శ్రీగంగానగర్ ఒక్కటే ఉండేది. వరుసగా ఇంధన ధరలు పెరగడంతో పలు పట్టణాల్లో పెట్రోల్ రేట్లు వంద రూపాయలకు పైగా చేరాయి. మరోసారి పెరుగుదల చోటుచేసుకుంటే 103 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి నెలకొంది.