91ముంబై: పెరిగిన పెట్రో ధరలు, నేడు ఎంతంటే?
Recommended Video

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో చమురు మార్కెటింగ్ సంస్థలు దేశీయ మార్కెట్లో రోజుకింత ధరల్ని పెంచుతూపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు సోమవారం కూడా పెరగడంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.91.08కి చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.79.72కి చేరుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను మరోమారు పెంచడంతో లీటరు పెట్రోల్పై 24పైసలు, డీజిల్పై 32పైసలు పెరిగింది.

దేశంలోని మిగతా ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్కతా, చెన్నైలలో కూడా ఇంధన ధరలు పైకి ఎగబాకాయి. మునుపటి గరిష్ట స్థాయి ధరల కంటే ఇది అత్యధికం. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.83.49, కోల్కతాలో రూ.85.30, చెన్నైలో రూ.86.80గా ఉంది.
హైదరాబాద్లో పెట్రోల్ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్ ధర 81.68 గా ఉంది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్ ధర రూ. 80.37. కాగా, గత అగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకి బలహీనపడుతుండటం కూడా ఇంధన ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
వాహనదారులకు భారీ ఉపశమనం? -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications