వాహనదారులకు శుభవార్త: వరుసగా 4వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు ఊరట లభిస్తోంది. వరుసగా నాలుగో రోజైన ఆదివారం కూడా పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో వీటి ధరలు తగ్గాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.81.74కు చేరింది. లీటర్ డీజిల్ ధర 17 పైసలు తగ్గి రూ.75.19 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర25పైసలు, డీజిల్ 18 పైసలు తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర రూ.87.21 , డీజిల్ ధర రూ.78.82గా ఉంది.

గత గురువారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి డీజిల్ ధర కేవలం రూ.2.74 పైసులు మాత్రమే పెరిగింది. అదే పెట్రోల్ ధర రూ.1.33 పైసలు పెరిగింది. కానీ ప్రభుత్వాలు కేంద్రం, బీజేపీ పాలిత ప్రభుత్వాలు రూ.2.50 పైసలు ఊరట కల్పించింది.












Click it and Unblock the Notifications