55 నెలల గరిష్టానికి చేరిన పెట్రోల్, డీజీల్ ధరలు, వినియోగదారులకు శాపమేనా?

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రికార్డు స్థాయి ధరకు పెట్రోల్ ధరలు చేరుకొన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.04కు చేరుకొన్నాయి. డీజీల్ ధర లీటర్ రూ. 65.65కు చేరుకొంది.దీంతో ఆల్‌టైమ్ రికార్డు ధరను నమోదు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు.

రోజూవారీగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతున్నాయి.ఈ నిర్ణయం కారణంగా ఎంత ధర పెరిగిందనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. గత ఏడాది జూన్ నుండి ప్రతి రోజూ పెట్రోల్ ధరలను రోజూ వారీగా సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలో సమారు పది రూపాయాలకు పైగా లీటర్‌పై పెట్రోల్ ధరలు పెరిగాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Petrol Price Continues Its Upward Drive, Diesel Price At A New High, Again

ఇవాళ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగింది.అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శనివారం పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచిన విషయం తెలిసిందే.నవంబరు 2014, జనవరి 2016 మధ్యకాలంలో ఆర్థిక మంత్రి మొత్తం తొమ్మిదిసార్లు ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు. అయితే కేవలం గతేడాది అక్టోబరులో మాత్రం ఒకే ఒకసారి రూ.2 తగ్గించారు.

పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే వ్యాట్‌ను తగ్గించాయి. మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం వినతిని అసలు పట్టించుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+