వరుసగా రెండో రోజూ అతి స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత 15రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండో రోజు కూడా ఆయిల్ కంపెనీలు స్వల్ప మొత్తంలో తగ్గించాయి. బుధవారం వినియోగదారులకు ముష్టివేసినట్లుగా 1పైసా మాత్రమే తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గురువారం లీటర్ పెట్రోల్పై 7పైసలు, లీటర్ డీజిల్పై 5పైసలు తగ్గించాయి.
అంతర్జాతీయ ఆయిల్ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.42 నుంచి 78.35కి తగ్గింది.

అదే విధంగా డీజిల్ ధర కూడా లీటర్ రూ.69.30 ఉండగా 69.25కు తగ్గింది. 15 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్పై రూ.3.8, డీజిల్పై రూ.3.38 ధర పెరిగింది.
పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి సంబురాలు చేసుకోండంటూ ఆయిల్ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
-
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications