పండగ పూటా వాతే: పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ భగ్గు: హైదరాబాద్లో రేటిదీ
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ మళ్లీ భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూనే పోతున్నాయి. పండగ పూట కూడా విరామాన్ని ఇవ్వట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వరుసగా ఇది ఆరో రోజు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయల మార్క్ను దాటేసింది.

పెట్రోల్, డీజిల్పై ఎంత పెరిగిందంటే..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. ఇదే పెరుగుదల అన్ని ఆయిల్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను దాటింది. ఈ మార్క్ను అందుకున్న నగరాల సంఖ్య ఇదివరకు చాలా పరిమితంగా ఉండేది. ఇప్పడు పరిస్థితి మారింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలను దాటేసింది.

చెన్నైలో కూడా వందకు పైగా
దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.104.14 పైసలకు చేరింది. డీజిల్ 92.82 పైసలుగా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ.110.12 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ ధర వంద రూపాయలను దాటింది. రూ.100.66 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.101.53 పైసలు, డీజిల్ ధర రూ.97.26 పైసలుగా నమోదైంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది. వరుసగా పెంచుతోన్న ధరల వల్ల ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్ను దాటింది. ఇదివరకు దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే చెన్నైలోనే దాని ధర తక్కువగా ఉండేది.

హైదరాబాద్లో
కాగా- తాజా పెంపుతో కోల్కతలో పెట్రోల్ ధర రూ.104.80 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.95.93పైసలు. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.107.77, డీజిల్ రూ.98.52 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.101.18 పైసలు, డీజిల్ రూ.93.26 పైసలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.98.66 పైసలు, డీజిల్-97.98 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్ రూ.107.29 పైసలు, డీజిల్ రూ.99.36 పైసలు, చండీగఢ్లో పెట్రోల్ రూ.100.24 పైసలు, డీజిల్ 92.55 పైసలుగా నమోదైంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.108.33 పైసలు, డీజిల్ రూ.101.27 పైసలు పలుకుతోంది.

ఇప్పట్లో ఆగేది కష్టమే..
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఇక్కడితో ఆగలేనూ కనిపించట్లేదు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. ఈ నెల ఆరంభంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల- మున్ముందు మరిన్ని వాతలు ఉంటాయనే సంకేతాన్ని చమురు కంపెనీలు ఇవ్వకనే ఇచ్చినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్లే ఇంధన ధరలను సవరించాల్సి వచ్చిందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications