Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.87.77: పెట్రోల్, డీజిల్ ధరల కొత్త రికార్డులు, ఏ సిటీలో ఎంతంటే?

Recommended Video

    రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    న్యూఢిల్లీ: రోజు రోజుకూ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే లీటర్‌ పెట్రోల్‌పై 48 పైసలు పెరగగా.. శనివారం ఉదయం మరో 39 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80ని దాటింది.

    శనివారం నాటి ఆయిల్‌ కంపెనీల ధరల ప్రకారం.. న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80.38గా ఉంది. ముంబైలో అత్యధికంగా రూ. 87.7 నమోదైంది. చెన్నైలో రూ. 83.54, కోల్‌కతాలో రూ. 83.27, హైదరాబాద్‌లో రూ. 85.23గా ఉంది.

    Petrol prices hit new high, Rs.87.77 per litre in Mumbai: Check today’s rate

    ఇక డీజిల్‌ కూడా శనివారం 44 పైసలు పెరిగి ఢిల్లీలో లీటర్‌ ధర రూ. 72.51గా ఉంది. ముంబైలో రూ. 76.98, చెన్నైలో రూ. 76.64, కోల్‌కతాలో రూ. 75.36, హైదరాబాద్‌లో రూ. 78.87గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.36పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.79.65గా ఉంది.

    ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో పాటు రవాణా సుంకాలు అధికంగా ఉండటంతో దేశంలో ఇంధన ధరలు పైపైకి పోతున్నాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్‌ ధరలకు నిరసనగా ఈ నెల 10న దేశవ్యాప్త బంద్‌ చేపట్టనున్నట్లు ప్రకటించాయి.

    More From
    Prev
    Next
    Read in English: Petrol prices hit new high
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+