రూ.87.77: పెట్రోల్, డీజిల్ ధరల కొత్త రికార్డులు, ఏ సిటీలో ఎంతంటే?
Recommended Video

న్యూఢిల్లీ: రోజు రోజుకూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే లీటర్ పెట్రోల్పై 48 పైసలు పెరగగా.. శనివారం ఉదయం మరో 39 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80ని దాటింది.
శనివారం నాటి ఆయిల్ కంపెనీల ధరల ప్రకారం.. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.38గా ఉంది. ముంబైలో అత్యధికంగా రూ. 87.7 నమోదైంది. చెన్నైలో రూ. 83.54, కోల్కతాలో రూ. 83.27, హైదరాబాద్లో రూ. 85.23గా ఉంది.

ఇక డీజిల్ కూడా శనివారం 44 పైసలు పెరిగి ఢిల్లీలో లీటర్ ధర రూ. 72.51గా ఉంది. ముంబైలో రూ. 76.98, చెన్నైలో రూ. 76.64, కోల్కతాలో రూ. 75.36, హైదరాబాద్లో రూ. 78.87గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.36పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.79.65గా ఉంది.
ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో పాటు రవాణా సుంకాలు అధికంగా ఉండటంతో దేశంలో ఇంధన ధరలు పైపైకి పోతున్నాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్ ధరలకు నిరసనగా ఈ నెల 10న దేశవ్యాప్త బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications