అక్కడా పోటీ చేస్తాం: మహా గెలుపుపై అసద్ (పిక్చర్స్)
హైదరాబాద్: మహారాష్ట్రలో తాము 24 స్థానాల్లో పోటీ చేస్తే తమకు సుమారు 5 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం రాత్రి స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో మజ్లిస్ గెలుపు నేపథ్యంలో ఆయన దారుస్సలేంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తాము రెండు చోట్ల విజయం సాధించడంతో పాటు మూడు సెగ్మెంట్లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నామన్నారు.
ఇక నుండి మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. కర్నాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి పార్టీని విస్తరిస్తామన్నారు. మహారాష్ట్ర ప్రజలు తమను ఆదరించారని అక్బరుద్దీన్ అన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ
ముస్లీంలు, బీసీలు, దళితులను ఏకం చేయడంలో తాను సఫలమయ్యామని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తాము మహారాష్ట్రలో పర్యటించినప్పుడు తమను జై మీమ్, జై భీమ్ నినాదాలతో స్వాగతించారని అసద్ అన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ
ముస్లీంలు, బీసీలు, దళితులను ఏకంగా చేసి ముందుకు వెళ్లడమే తమ లక్ష్యమని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
అసదుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో తాము 24 స్థానాల్లో పోటీ చేస్తే తమకు సుమారు 5 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం రాత్రి స్పష్టం చేశారు.
అసదుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్రలో మజ్లిస్ గెలుపు నేపథ్యంలో ఆయన దారుస్సలేంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తాము రెండు చోట్ల విజయం సాధించడంతో పాటు మూడు సెగ్మెంట్లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నామన్నారు.