Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్ లో పైలట్ల పాత్రపై ట్విస్టులు..! హైకోర్టులో కీలక పిటిషన్ ..!

గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిన ఘటనలో 275 మంది వరకూ చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తాజాగా ప్రాధమిక నివేదిక ఇచ్చింది. ఇందులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పైలట్ల సమన్వయ లోపాలు బయటపడ్డాయి. అలాగే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కాక్ పిట్ రికార్డర్ల అధ్యయన ఫలితాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది.

ఈ రెండు రిపోర్టుల్లోనూ విమానంలో ఎలాంటి లోపాలు లేవని దాదాపుగా తేలిపోయింది. దీంతో పైలట్ల మధ్య సమన్యయ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న చర్చ సాగుతోంది. దీంతో భారత పైలట్ల సంఘంతో పాటు అంతర్జాతీయ పైలట్ల అసోసియేషన్ సైతం ఈ రిపోర్టుల్ని తోసిపుచ్చుతున్నాయి. ఇంకేదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశాయి. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈ రిపోర్టుల ఆధారంగా అప్పుడే ఓ అంచనాకు రావొద్దని సూచించారు.

pil filed in madras high court over media coverage of aviation accidents in wake of air india crash

ఈ నేపథ్యంలో పైలట్ల పాత్రపై మీడియా కథనాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇందులో పిటిషనర్ అయిన కోయంబత్తూరుకు చెందిన లాయర్ ప్రవీణ్.. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విమాన ప్రమాదాల మీడియా కవరేజీని నియంత్రించడానికి మార్గదర్శకాలు, సలహాలు జారీ చేయాలని ఆదేశించాలని కోర్టును కోరారు.

మరణానంతరం వ్యాప్తి చేయబడిన నిరాధారమైన ఆరోపణలు మరియు ఊహాజనిత కథనాలు మరణించిన వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తాయని పిటిషన్లో ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే దుఃఖిస్తున్న కుటుంబాలకు భావోద్వేగ గాయాన్ని కలిగిస్తాయన్నారు. అధికారికంగా దర్యాప్తు పూర్తికాకుండా మధ్యలోనే పైలట్లను నిందించే చర్యల్ని అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. ఇటువంటి ధృవీకరించని నివేదికలు పైలట్ల వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీస్తాయని, విమానయాన భద్రతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, అధికారిక దర్యాప్తు ప్రక్రియల సమగ్రతను దెబ్బతీస్తుందని తెలిపారు.

pil filed in madras high court over media coverage of aviation accidents in wake of air india crash

ఈ నెల 14న తాను ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు విజ్ఞాపన పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. మీడియా కథనాల తీరు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(ఏ), ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కూడా తెలిపారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+