ఫేస్ బుక్, వాట్సాప్ లపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం,దేశ భద్రతకు ముప్పు
ఫేస్ బుక్ , వాట్సాప్ లపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
న్యూఢిల్లీ:ఫేస్ బుక్ , వాట్సాప్ లపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండు ఫాల్ ఫామ్ లపై అందిస్తోన్న ఇంటర్నెట్ కాల్స్ను రెగ్యులేటరే కిందకు తీసుకురావాలంటూ పిడి మూర్తి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారించిన ఢిల్లీ హైకోర్టు తమ స్పందనను తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ లతో కూడిన బెంచ్ ఈ మేరకు రెండు నోటీసలును సంబంధిత మంత్రిత్వశాఖలకు పంపింది.
పిటిషన్ లో లేవనెత్తిన అంశాలపై ఆరు వారాల్లోపుగా అఫిడవిట్లను దాఖలు చేయాలని తదుపరి విచారణనను మే 3వ, తేదిన చేపట్టనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

ఫేస్ బుక్, వాట్సాప్ లు చేపడుతున్న నియంత్రణ లేని కార్యకలాపాలతో దేశ భద్రతలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అంతేకాదు ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఆయన చెప్పారు.
ఈ రెండింటిని టెలికం సర్వీస్ ఫ్రోవైడర్ లాగా ఓ రెగ్యులేటర్ ప్రేమ్ వర్క్ లోకి తీసుకురావాలని పిటిషనర్ కోరారు. దీనికి సంబంధించిన అధారిటీలను ఆదేశించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications