Railway : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక ఆ భారం తప్పింది...
దక్షిణ మధ్య రైల్వే విభాగం రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలను రూ.10కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్,హైదరాబాద్ స్టేషన్లలో మాత్రం ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20గా ఉంటుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు ఇదివరకు ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. ఎట్టకేలకు ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ అన్ని రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఎత్తేసిన కొత్తలో స్పెషల్ రైళ్లను మాత్రమే నడిపిన రైల్వే శాఖ... క్రమంగా రెగ్యులర్ రైళ్లను పట్టాలెక్కించింది. ఈ నెల 19 నుంచి దాదాపు 82 రైళ్లను పున:ప్రారంభించింది. వీటిలో 16 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ రైళ్లకు స్టేషన్లలోనే టికెట్లు ఇస్తారని రైల్వే శాఖ ఆ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం,మాస్కు ధరించడం వంటివి తప్పనిసరి.

ఇక ఇటీవలే ప్రైవేట్ రైళ్లకు రైల్వే శాఖ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లకు బిడ్లు ఆహ్వానించారు.కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ రైళ్లపై ప్రైవేట్ రైళ్ల ప్రభావం ఉండబోదన్నారు.రైల్వే శాఖకు చెందిన ట్రాక్,సిగ్నల్స్,ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్నే ప్రైవేట్ రైళ్లు వాడుకుంటాయని తెలిపారు. ఈ రైళ్ల నిర్వహణకు అవసరమయ్యే లోకో పైలట్లు,గార్డులను రైల్వే శాఖనే అందించనుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications