ఢిల్లీ ఫలితాలు: మోడీ ఫోన్, వచ్చి కలుస్తానని కేజ్రీ.. జనతా కా సీఎం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్కు స్వయంగా ఫోన్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ దూసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఏఏపీ 60 స్థానాల వరకు గెలుచుకోగా, బీజేపీ కేవలం ఏడెనిమిది స్థానాలకు పడిపోయింది.
కేజ్రీవాల్కు మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అభివృద్ధిలో కలిసి నడుద్దామని పేర్కొన్నారు. అందుకు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు.
జనతా కా సీఎం.. కేజ్రీవాల్

న్యూఢిల్లీలోని పటేల్ నగర్లో ఉన్న ఏఏపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ ఏఏపీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద 'జనతా కా సీఎం' అంటూ కేజ్రీవాల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.
2013 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 31, ఏఏపీ 28, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఏఏపీ దాదాపు అరవై స్థానాల వరకు గెలుచుకుంటుంది. బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications