ఢిల్లీ రిజల్ట్స్, బీజేపీ ఓటమి: ప్రజలు సరైన తీర్పిచ్చారని కేసీఆర్, బాబు అభినందన
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపై పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. కేజ్రీవాల్కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడం ద్వారా ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. ఏఏపీ విజయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకూడా కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు.
సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. మమతా బెనర్జీ కూడా కేజ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. ఏఏపీ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త టర్నింగ్ అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్కు స్వయంగా ఫోన్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ దూసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఏఏపీ 60 స్థానాల వరకు గెలుచుకోగా, బీజేపీ కేవలం ఏడెనిమిది స్థానాలకు పడిపోయింది.
కేజ్రీవాల్కు మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అభివృద్ధిలో కలిసి నడుద్దామని పేర్కొన్నారు. అందుకు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. కేజ్రీవాల్కు కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జనతా కా సీఎం.. కేజ్రీవాల్
న్యూఢిల్లీలోని పటేల్ నగర్లో ఉన్న ఏఏపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ ఏఏపీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద 'జనతా కా సీఎం' అంటూ కేజ్రీవాల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.
2013 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 31, ఏఏపీ 28, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఏఏపీ దాదాపు అరవై స్థానాల వరకు గెలుచుకుంటుంది. బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications