ఆ రాష్ట్రాన్ని, సీఎంను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ, డేట్ ఫిక్స్, ఎన్నికలు పూర్తి అయితే?
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మంగళూరు, బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మళ్లీ రెండు రోజుల పాటు కర్ణాటకలోని ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీ గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో గెలిచిన అన్ని లోక్ సభ స్థానాలను నిలబెట్టుకోవాలని నిర్ణయించారని తెలిసింది. కర్ణాటకలో మోదీ పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైయ్యింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28వ తేదీ, 29వ తేదీలలో రెండు రోజుల పాటు కర్ణాటకలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల కర్ణాటకలోని కోస్తా ప్రాంతంల్లో పర్యటించిన ప్రధాని ఉత్తర కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 400కు పైగా నియోజక వర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటికే మోదీ ర్యాలీలు జరిగాయి. పార్టీ సీనియర్ నేతలతో సహా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు, వాటిలో కర్ణాటక ఒకటి. కర్ణాటకలో మోదీ మెగా రోడ్ షో తేదీలు నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని మోదీ ఉత్తర కర్ణాటకకు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రానున్నారు. ఏప్రిల్ 28వ తేదీ, 29వ తేదీల్లో ఆరు లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రధాని మెగా రోడ్ షో నిర్వహించనున్నారు.
బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలను చైతన్యవంతులను చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రధాని మోదీ ఇదే సమయంలో వివరిస్తారు. రెండు రోజుల్లో కర్ణాటకలోని 12 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండ దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భాగంగా ఉత్తర కర్ణాటకలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 28న ఉత్తర కర్ణాటకకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పర్యటించి బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వెయ్యాలని ప్రజలకు మనవి చెయ్యనున్నారు.












Click it and Unblock the Notifications