రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం : ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. పాస్పోర్టు లేని వారికి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి.

ప్రధాని కీలక సమావేశం
రష్యా బాంబుల దాడితో ఉక్రెయిన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్లో వేలాదిమంది భారతీయులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదు విమానాల్లో సుమారు 1200 మందిని స్వదేశానికి తరలించింది. ఈనేపథ్యంలో మరింత వేగంగా భారతీయులను తీసుకోచ్చేందుకు తీసుకోవాల్సిన చర్చలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్రమంత్రులు
ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శకంర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు కేంద్రమంత్రులు, అధికారులు వెళ్లి భారతీయుల తరలింపులో సమన్వయం చేసుకోవాలని మోదీ సూచించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని స్వదేశానికి తీసుకువస్తామని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
పాస్పోర్టు లేనివారికి శుభవార్త
మరోవైపు వివిధ కారణాలతో పాస్ పోర్టు లేక ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారిని ఇండియాకు తీసుకువచ్చే విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. పాస్ పోర్టులు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పాస్ పోర్టులు లేని భారతీయులకు అత్యవసర సర్టిఫికెట్లు విదేశాంగ శాఖ అధికారులు జారీ చేస్తారని చెప్పారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!











Click it and Unblock the Notifications