ట్రంప్ కు మోదీ మార్క్ షాక్..: దెబ్బకు దిగిరావాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. త్వరలోనే చైనా పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చైనా సుప్రీమ్ గ్ఝి జిన్ పింగ్ తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి మోదీ ఈ నెల 31వ తేదీన చైనాకు బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు టియాన్జియాన్ లో బస చేయనున్నారు. దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లబోతోండటం ఇదే తొలిసారి.
2020లో వీటిని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్ బాబు అమరుడయ్యారు.
ఈ ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద చాలాకాలం పాటు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో పర్యటించారు. ఆ దేశ పౌరులకు విసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ చైనా పర్యటన చేపట్టారు. జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. ఇవి- డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇరు దేశాల వాణిజ్యం, కనెక్టివిటీ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తన్మయ్ లాల్ తెలిపారు.
ఈ ఆదివారమే టియాంజియాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీ ఏర్పాటు కానుంది. 20 మందికి పైగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇందులో పాల్గొననున్నారు. మధ్య- ఆసియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు హాజరవుతారు.












Click it and Unblock the Notifications