మోడీని ఓడించడం కష్టమేమీ కాదు : సోనియా గాంధీ.. రాయ్బరేలీ నుంచి నామినేషన్
రాయ్బరేలీ : కాంగ్రెస్ కు కంచుకోటైన రాయ్బరేలీ సెగ్మెంట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి ఆమె నాలుగు సార్లు గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమైన నియోజకవర్గం కావడం.. ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీచేస్తుండటంతో ఇటువైపు దేశవ్యాప్త దృష్టి మళ్లుతుంది. సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో.. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ఉన్నారు.
నామినేషన్ ప్రక్రియ తర్వాత సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడం చాలా కష్టమా అంటూ విలేఖర్లు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. 2004 లో వాజ్పేయి మీద గెలిచిన విషయం మరచిపోవద్దన్నారు.

అనంతరం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీమాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఓడించడం అపొజిషన్ పార్టీలకు కష్టమని వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లలో దేశ ప్రజలకు మోడీ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆయన సామర్థ్యం, పనితనం గురించి ఎన్నికల ఫలితాల తర్వాత క్లియర్ పిక్చర్ వస్తుందని ఎద్దేవా చేశారు.
నామినేషన్ సందర్భంలో వంశపారపర్యంగా పాటిస్తున్న పూజావిధానాలు పాటించారు సోనియా. 1967 లో ఇందిరాగాంధీ తొలిసారిగా ఈ పూజ నిర్వహించాకే.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం విశేషం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications