మోడీ యుగపురుషుడు: సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంస
గాంధీనగర్: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తారు. ఆయనను యుగపురుషుడిగా అభివర్ణించారు. ఆదివారంనాడు ఆమె గుజరాత్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ మోడీని సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్, గాంధీలతో పోల్చారు.
"ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్, బాపూజీ (మహాత్మా గాంధీ)లకు చెందిన ఈ నేలకు (గుజరాత్) వచ్చాను. ఈ నేలనే మనకు యుగపుడురుషుడు.. మన ప్రధానిని ఇచ్చింది. ఈ నేలకు తల వంచి నమస్కరించడానికి వచ్చాను" అని ఆమె గాంధీనగర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

రామాలయం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాళ్లు రామాలయం నిర్మిస్తారని, తాము నిర్మించబోమని చెప్పారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. సాధ్వి రితంబర సమక్షంలో ప్రారంభమైన భక్తి యోగ వేదాంత సమ్మేళనంలో పాల్గొనడానికి సాధ్వి నిరంజన్ జ్యోతి ఇక్కడికి వచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్డీఎ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. నిరంజన్ జ్యోతి రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పు పట్టారు. దాంతో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications