మోడీ యుగపురుషుడు: సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంస
గాంధీనగర్: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తారు. ఆయనను యుగపురుషుడిగా అభివర్ణించారు. ఆదివారంనాడు ఆమె గుజరాత్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ మోడీని సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్, గాంధీలతో పోల్చారు.
"ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్, బాపూజీ (మహాత్మా గాంధీ)లకు చెందిన ఈ నేలకు (గుజరాత్) వచ్చాను. ఈ నేలనే మనకు యుగపుడురుషుడు.. మన ప్రధానిని ఇచ్చింది. ఈ నేలకు తల వంచి నమస్కరించడానికి వచ్చాను" అని ఆమె గాంధీనగర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

రామాలయం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాళ్లు రామాలయం నిర్మిస్తారని, తాము నిర్మించబోమని చెప్పారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. సాధ్వి రితంబర సమక్షంలో ప్రారంభమైన భక్తి యోగ వేదాంత సమ్మేళనంలో పాల్గొనడానికి సాధ్వి నిరంజన్ జ్యోతి ఇక్కడికి వచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్డీఎ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. నిరంజన్ జ్యోతి రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పు పట్టారు. దాంతో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications