Parliament: విపక్షాలపై నిప్పులు చెరిగిన మోడీ-నిరసనలతో అడ్డుకున్న ఇండియా కూటమి..!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఇవాళ లోక్ సభలో మరోసారి వాడీవేడీ వాతావరణం నెలకొంది.ప్రధాని మోడీ ప్రసంగానికి లేవగానే విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నినాదాలతో లోక్ సభను హోరెత్తించాయి. దీనికి బీజేపీ సహా ఎన్డీయే పక్షాలు కూడా కౌంటర్ గా రంగంలోకి దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. చివరికి ప్రధాని మోడీ తాను చెప్పాల్సింది చెప్పి ముగించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ప్రసంగించేందుకు ప్రధాని మోడీ సిద్దం కాగానే విపక్షాలు నినాదాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మణిపూర్ హింస, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.దీంతో ఓ దశలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విపక్ష నేత రాహుల్ గాంధీని మందలించాల్సి వచ్చింది. అనంతరం ప్రధాని మోడీ రాహుుల్ ను ఉద్దేశించి కొందరి బాధను తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. తమపై అసత్యాలు ప్రచారం చేసిన తర్వాత కూడా విపక్షాలు ఓటమిని రుచి చూశాయని మోడీ విమర్శించారు. భారత ప్రజలు మూడోసారి తనకు పనిచేసే అవకాశం ఇచ్చారన్నారు.

మణిపూర్ నినాదాలను చేస్తున్న విపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోడీ.. ఈ దేశం బుజ్జగింపు రాజకీయాలను చూసింది కానీ తాము సంతృప్తి రాజకీయాలు చేశామని, బుజ్జగింపు రాజకీయాలు కావన్నారు. అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడమే తమ మంత్రం అన్నారు. హిందూ సంస్కృతిని తప్పుబట్టడాన్ని కొందరు ఫ్యాషన్ గా మార్చుకున్నారంటూ రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు.
#WATCH | PM Narendra Modi says, "I remember an incident, there was a boy who scored 99 marks and he used to show it to everyone. When people heard 99, they used to encourage him a lot. Then a teacher came and said why are you distributing sweets? He did not score 99 out of 100… pic.twitter.com/bfYYMKB1id
— ANI (@ANI) July 2, 2024
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications