Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం, ద్వైపాక్షిక చర్చలు - స్టేట్ డిన్నర్..!!

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. పర్యటనలో రెండో రోజు వాషింగ్టన్ చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు వర్షంలోనూ ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అండ్రూస్ జాయింట్ బేస్ విమానాశ్రయంలో దిగిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వర్షం పడుతుండటంతో రెయిన్ కోట్ ధరించిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత వైట్ హౌస్ చేరుకున్న ప్రధానిని అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు.

శ్వేత సౌధంలో ప్రధాని మోదీ:అమెరికాలో ప్రస్తుతం మోదీ మేనియా కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరిన ప్రధాని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందే పలువురు ప్రముఖులతో ప్రధాని భేటీ అయ్యారు.

PM Modi meets President of the US at The White House, state dinner Bilateral meeting with Joe Biden

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధానితో సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరగా భారత్ కు రావాలనేదే తమ ఆలోచనగా భేటీ అనంతరం వెల్లడించారు. ఆర్దిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోమెర్ తో జరిగిన భేటీలో భారత్ డిజిటల్ ప్రయాణం, ఆధార్, డిజిలాకర్ వంటి వాటిపైన చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం భారత్ కు సమయమొచ్చిందని ప్రధానితో భేటీ తరువాత ఇన్వెస్టర్ డేలియా అభిప్రాయపడ్డారు.

బైడెన్ తో ప్రధాని చర్చలు:వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి వేదికను పంచుకొన్నారు మోదీ. భారత్-అమెరికా విద్యార్థులను కలుసుకున్నారు. వారితో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు.

శ్వేతసౌధం వద్ద ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. జిల్లి బైడెన్...జో బైడెన్ తో ప్రధాని మోదీ చర్చలు చేసారు. జిల్లీ బైడెన్ ప్రధాని మోదీకి 20వ శతాబ్దానికి సంబంధించి అమెరికన్ బెక్ గ్యాలరీని బహుమతిగా అందించారు. అధ్యక్షుడు జో బైడెన్ వింటేజ్ అమెరికా కెమేరాను ప్రధాని మోదీకి గిఫ్ట్ గా అందచేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. భారత్ - అమెరికా బంధంలో ఈ పర్యటన కీలకం కానుందని శ్వేత సౌధం ప్రకటించింది. ద్వైపాక్షిక చర్చలు...పలు నిర్ణయాలు ఈ పర్యటనలో జరగనున్నాయి.

PM Modi meets President of the US at The White House, state dinner Bilateral meeting with Joe Biden

ప్రధానికి ఆత్మీయ విందు:శ్వేతసౌధంలో ప్రధాని మోదీకి గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. డిషెస్ లో ప్రధాని మోదీ నిరంతరం ప్రమోట్ చేసే మిల్లెట్స్ ను ఉంచారు. ఈ రోజు ప్రధాని మోదీ అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. జాయింట్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించబోతోండటం మోదీకి ఇది రెండోసారి.

ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. మోదీ ఫొటోలు.. భారతీయ జెండాలతో అమెరికాలోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అడుగడుగునా అభిమానం చాటుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+