మోడీ రాగానే ముఖ్యమంత్రి, శశికళ కన్నీరుమున్నీరు, భుజం తట్టిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళలు కండతడి పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయ పార్థీవదేహానికి మోడీ నివాళులు అర్పించారు.
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళలు కండతడి పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయ పార్థీవదేహానికి మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం, శశికళలు ఏడుపు ఆపుకోలేకపోయారు.
వారిద్దరు ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో.. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భుజం తట్టి ఓదార్చారు. అనంతరం పలువురు సీనియర్ నేతలు, ఇతరులతో ప్రధాని మోడీ మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాల్ వద్ద ఉంచిన జయలలిత పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మోడీ వెంట మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే జయలలిత అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
#WATCH: PM Modi pays his last respects to #Jayalalithaa at Rajaji Hall in Chennai. pic.twitter.com/Wass8nxUpv
— ANI (@ANI_news) December 6, 2016
ఇదిలా ఉండగా, సాయంత్రం నాలుగున్నర గంటలకు మెరీనా బీచ్లో జయ అంత్యక్రియలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెన్నై బయలుదేరారు.

కన్నీరుమున్నీరు అవుతూ పన్నీరు సెల్వం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంతకుముందు నివాళులర్పించారు. రాజాజీ హాల్లో అమ్మ పార్థివదేహం వద్ద పుష్ఫగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జయలలిత పార్థివదేహం పక్కనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన అమ్మ ఇక లేదంటూ ఆయన రోదించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications