ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం, బెర్లిన్కు మరో విమానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747-400లో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుండి పారిస్, టౌలోస్, హనోపర్ మీదుగా బెర్లిన్కు ప్రధాని మోడీ ఈ విమానంలోనే ప్రయాణించారు.
దానిలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం మరో విమానాన్ని పంపించారు. ముంబైలో సిద్ధంగా ఉంచిన ప్రత్యామ్నాయ విమానాన్ని పంపించారు. కెనడా పర్యటన నిమిత్తం ఒటావాకు చేరుకునేందుకు ప్రధాని మోడీ, ఆయన వెంట ఉన్న ప్రతినిధులు ఈ విమానాన్ని ఉపయోగిస్తారు.

ప్రత్యామ్నాయ విమానంలో కొంతమంది అదనపు సిబ్బందిని ఎయిర్ ఇండియా పంపించింది. ఈ నెల 9న ప్యారిస్కు బయలుదేరిన ప్రధాని మోడీ ఈ నెల 18న స్వదేశం రానున్నారు. ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఇలా ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications