వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం, బెర్లిన్కు మరో విమానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని విదేశీ పర్యటనకు తీసుకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747-400లో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుండి పారిస్, టౌలోస్, హనోపర్ మీదుగా బెర్లిన్కు ప్రధాని మోడీ ఈ విమానంలోనే ప్రయాణించారు.
దానిలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం మరో విమానాన్ని పంపించారు. ముంబైలో సిద్ధంగా ఉంచిన ప్రత్యామ్నాయ విమానాన్ని పంపించారు. కెనడా పర్యటన నిమిత్తం ఒటావాకు చేరుకునేందుకు ప్రధాని మోడీ, ఆయన వెంట ఉన్న ప్రతినిధులు ఈ విమానాన్ని ఉపయోగిస్తారు.
ప్రత్యామ్నాయ విమానంలో కొంతమంది అదనపు సిబ్బందిని ఎయిర్ ఇండియా పంపించింది. ఈ నెల 9న ప్యారిస్కు బయలుదేరిన ప్రధాని మోడీ ఈ నెల 18న స్వదేశం రానున్నారు. ప్రోటోకాల్ నిబంధనల మేరకు ఇలా ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెప్పారు.
Comments
English summary
Air India One, a Boeing 747-400 aircraft that carried Prime Minister Narendra Modi from Delhi to Berlin after halts in Paris, Toulouse and Hannover, developed engine problems and had to be replaced by another plane.
Story first published: Wednesday, April 15, 2015, 14:51 [IST]