UPSC అభ్యర్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. 'ప్రతిభా సేతు' పోర్టల్ ప్రారంభం
దేశంలోని అత్యంత కఠినతరమైన పరీక్షల్లో UPSC ఒకటి. దేశంలో యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా గుడ్ న్యూస్ తెలిపారు. కష్టతరమైన ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన్ కీ బాత్ 125 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యూపీఎస్సీ పరీక్షలకు హాజరై తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిభా సేతు పేరుతో ఈ పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు.
UPSC की अलग-अलग परीक्षाओं में जो होनहार प्रतिभागी आखिरी मेरिट लिस्ट का हिस्सा नहीं बन पाते, उनके लिए ‘प्रतिभा सेतु’ Digital Platform बनाया गया है। यह बहुत खुशी की बात है कि इसकी मदद से उन्हें नए अवसर मिलने लगे हैं।#MannKiBaat pic.twitter.com/7SFjGxt7Ra
— Narendra Modi (@narendramodi) August 31, 2025
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ 125 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో స్వదేశీ వస్తువులు, ఆకస్మిక వరదలు, క్రీడలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
'యూపీఎస్సీ దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒక్కటిగా ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలను యూపీఎస్సీ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అత్యంత ప్రతిభావంతులైన వేలాది మంది అభ్యర్థుల స్వల్ప తేడాతో తుది జాబితాలో చోటు దక్కించుకోలేక పోతుంటారు. ఫలితంగా వారు వేరే పరీక్షల కోసం మళ్లీ సిద్ధం కావాల్సి వస్తోంది. దీని వల్ల సమయం, డబ్బు రెండు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసం కొత్తగా ప్రతిభా సేతు పేరుతో డిజిటల్ పోర్టల్ ను ప్రారంభించాం.

ఈ ప్రతిభా సేతు పోర్టల్ లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అన్ని దశలు దాటి తుది జాబితాలో చోటు దక్కని వారి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్ లో 10వేల మందికి పైగా ప్రతిభావంతులైన సమాచారం ఉంది. ఈ పోర్టల్ ద్వారా ప్రైవేటు సంస్థలు అభ్యర్థుల సామర్థ్యాన్ని తెలుసుకొని ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications