తమిళనాడులో నేడు మోడీ పర్యటన: మహిళలకు స్కూటర్ పథకానికి శ్రీకారం
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్కూటర్ కొనుగోలు పథకాన్ని శనివారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 70వ, పుట్టినరోజును పురస్కరించుకొని ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించనుంది. జయలలిత 2016 ఎన్నికల సమయంలో ఈ హమీని ఇచ్చింది.

ఉద్యోగాలు చేసే మహిళలు స్కూటర్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చును భరించనున్నట్టు ప్రకటించింది.అయితే ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. డిఎంకె అధికార ప్రతినిధి రాధాకృష్ణన్ ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications